నర్వలో బిజెపి నాయకుల సంబరాలు

589చూసినవారు
నారాయణపేట జిల్లా నర్వ మండలానికి చెందిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి నారాయణపేట జిల్లా అధ్యక్షులుగా గురువారం ఎన్నికయ్యారు. ఈసందర్భంగా మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందంతో బాణాసంచాలు కాలుస్తూ మండల కేంద్రంలో సంబరాలు చేసుకున్నారు. తమ మండలానికి చెందిన నాయకుల్ని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కేంద్రమంత్రి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్