కర్ణాటక మద్యం పట్టివేత

552చూసినవారు
ఊట్కూర్ మండలం తిమ్మారెడ్డి పల్లి తాండాలో అక్రమంగా నిల్వఉంచిన కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో గురువారం తాండలో పర్యటించగా అనుమానం వచ్చి ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయగా సుమారు 9 లీటర్ల కర్ణాటక మద్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మద్యం నిల్వ చేసిన రాజు నాయక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్