ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బరల్పోఖరి గ్రామంలోని ఓ కస్టమర్ బిజయ్ పాండా అనే వ్యక్తి దుకాణం నుండి ₹ 180 విలువైన కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ₹ 140 చెల్లించారు. మిగిలిన ₹ 40 తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన వినియోగదారుడు షాపు యజమానిని హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.