హైవే-44పై ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీ

9756చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ సమీపంలో జాతీయ రహదారి-(44) పై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురికి గాయాలు కాగా అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. బనగానపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్