బిజినేపల్లి మండల కేంద్రంలో ఈనెల 23న జరిగే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభ స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం పరిశీలించారు. సీఎం సభకు లక్ష మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏడు నియోజకవర్గాల నుండి ప్రజలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.