కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్

81చూసినవారు
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను పునరుద్ధరిస్తామంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన ఎన్నికల బాండ్లను తిరిగి తెస్తామని ఎలా అంటారని దుయ్యబట్టారు. ఇప్పటికే ‘పే పీఎం స్కామ్’ కింద రూ.4లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న బీజేపీకి ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వరని అన్నారు.

సంబంధిత పోస్ట్