తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూలపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది నవ వసంతంలో రైతులకు మేలు కలగాలని, ప్రజలందరి కొత్త ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అకాంక్షించారు.