నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ. నిరుద్యోగ సమస్యతోపాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఓటు వేసి ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తుతానని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.