అర్ధరాత్రి భారీ చోరీ

55చూసినవారు
మరికల్ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కుర్వ రాములు అనే వ్యక్తి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు రెండు బీరువాల్లో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, 10 లక్షల నగదును తీసుకెళ్లారు. రాత్రి ఆరుబయట పడుకున్న రాములు ఉదయం లేచి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాల్లో ఉన్న బంగారం, నగదు కనిపించలేదని బాధితుడు తెలిపారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ ఇంటిని పరిశీలించి బాధితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్