వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. "సీఎం జగన్ ప్రభుత్వం డబుల్ డీ ప్రభుత్వం. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. వైసీపీ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరత ఉండదు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. స్వేచ్ఛే ఈ దేశానికి వెన్నెముక. జగన్ను చూసి, వైకాపా నాయకులను చూసిభయపడాలా?" అని గుడివాడ సభలో పవన్ ప్రశ్నించారు.