జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

61చూసినవారు
జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
రంజాన్ మాసం పురస్కరించుకుని శుక్రవారం నారాయణపేట పట్టణంలోని మస్జీద్, బస్టాండ్, ప్రధాన కూడళ్లలో బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతపరమైన చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, చాలా రోజులుగా నిలిపి ఉంచిన వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్