నారాయణపేట పట్టణంలో రేపు అనగా బుధవారం నిర్వహించే 'బడి బాట' కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొంటారని మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఉన్నత (గ్రౌండ్) పాఠశాల, లాల్ మస్జిద్ పాఠశాలలో జరిగే బడి బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని అన్నారు.