ఇండియా కూటమి సహాయ సహకారాలతో ఇకపై జాతీయ స్థాయిలో ఏపీ అధికారపార్టీపై ఉద్యమాలు చేసేందుకు జగన్ సన్నద్ధం అవుతున్నారు. జగన్ ఢిల్లీ ధర్నాలో ఉన్నప్పుడు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ జగన్ కు సపోర్ట్ గా నిలిచారు. అదే సమయంలో తృణమూల్ అధినేత మమతా బెనర్జీ సైతం జగన్ కు మద్దతు తెలిపారు. తమ ధర్నాకు మద్దతు తెలిపిన వారందరికీ మాజీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు.