కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని సిపిఐ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి రాము అన్నారు. మే డే సందర్భంగా నారాయణపేట భగత్ సింగ్ భవన్ లో జండాను ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీ పార్టీ మతాల మధ్య చిచ్చు పెడుతూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదని అన్నారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం కోడ్ లుగా మార్చిందని విమర్శించారు.