సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

590చూసినవారు
నారాయణపేట మండలం బొమ్మన్ పాడు గ్రామంలో బుధవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి చిత్రపటాలను కాంగ్రెస్ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. ముదిరాజులను బిసి డి నుంచి బిసి ఏ లోకి మార్చుతామని సీఎం హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముదిరాజుల ఎన్నో ఏళ్ల కల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నెరవేరబోతోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్