కిర్గిస్థాన్లో జరిగిన ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్ షిప్లో భారత రెజ్లర్లు అదరగొట్టారు. మొత్తం 9 పతకాలను సాధించారు. అందులో నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ టోర్నీలో పలు కేటగిరీల్లో మొత్తం 30 మంది భారత రెజ్లర్లు పాల్గొన్నారు. మొత్తం 9 పతకాలతో భారత్ మెడల్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. జపాన్ 19 మెడల్స్తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఈ టోర్నీలో భారత్ ఒక బంగారు పతకంతో సహా 14 పతకాలు సాధించింది.