రైతులకు ఇచ్జిన హామీలు నెరవేర్చాలి

66చూసినవారు
రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ. పంట నష్టపోయిన రైతులకు రూ. 25 వేలు ఇవ్వాలని, వరి ధాన్యానికి బోనస్ చెల్లించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్