వైభవంగా సీతారాముల కల్యాణం

71చూసినవారు
నారాయణపేట పట్టణంలోని మూల హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో బుధవారం సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అర్చకులు రఘు ప్రేమ్ జోషి మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం అప్పగింతల కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించారు. అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకొని పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్