నారాయణపేట పట్టణంలోని పిల్లల అనాథ ఆశ్రమాన్ని శనివారం సాయంత్రం సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆశ్రమం పరిసరాలను శుభ్రంగా ఉంచాలని చెప్పారు. అనాథ పిల్లలను సొంత పిల్లలుగా భావించాలని అన్నారు. ఆశ్రమంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.