లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన 11 మంది అభ్యర్థులకు చోటు కల్పించింది. ఒడిశాలో జాజ్పూర్-రవీంద్ర నారాయణ్ బెహరా, కందమాల్-సుకాంత్ కుమార్ పాణిగ్రాహి, కటక్-భర్తృహరి మహతాబ్, పశ్చిమబెంగాల్లో ఝార్గ్రామ్-ప్రణత్ తుడు, భీర్భూమ్-దేబాశిష్ ధర్లను బరిలోకి బీజేపీ దింపింది.