వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బూత్కూరులో వ్యవసాయానికి నీళ్లు కట్టడానికి వెళ్లిన శేఖర్ కు ఆదివారం పొలంలో కనిపించిన ముసలిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా స్నేక్ సొసైటీ అధ్యక్షులు కృష్ణ సాగర్ ఘటనా స్థలానికి పరిశీలించారు. 185 కేజీలు ఉన్న దాన్ని బంధించి జూరాల డ్యాంలో వదిలినట్లు కృష్ణ తెలిపారు. వారం క్రితం ముసలి 2 గొర్రె పిల్లలను, ఒక ఆవు దూడను చంపిందని గ్రామస్థులు తెలిపారు.