ప్రతి ఒక్కరు ఓటు వేస్తాం ప్రతిజ్ఞ

58చూసినవారు
మే 13న ఎన్నికలలో ప్రతి ఓటరూ కచ్చితంగా ఓటు వేయాలని వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రతిజ్ఞ చేయించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగంపై మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్, స్వీప్ నోడల్ అధికారి రామ మహేశ్వరరెడ్డి, ఎస్పీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్