జనరల్ ఆసుపత్రిలో సిబ్బంది ఇష్టారాజ్యం

555చూసినవారు
జనరల్ ఆసుపత్రిలో సిబ్బంది ఇష్టారాజ్యం
వనపర్తి జిల్లాలోని నర్సింగాయపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని రోగులు, ప్రజలు తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో ఉండే గర్భిణీలు, రోగులను చూసేందుకు వచ్చే కుటుంబ సభ్యులను ఆసుపత్రి సిబ్బంది లోనికి పంపడం లేదనే విమర్శలున్నాయి. ఈ విషయంపై సిబ్బందిని అడుగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్