వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో వెలసిన సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీకోటి లింగేశ్వర దత్తదేవస్థానములో ఆదివారం తృయోదశి సందర్భంగా నందీశ్వరునికి ప్రదోష కాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో మహామంగళహారతి సమర్పించారు. నందీశ్వరుని అబిషేకంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.