వైసీపీ పాలన మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లుగా ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు.