మహిళను సొంతూరికి పంపిన పోలీసులు

1855చూసినవారు
మహిళను సొంతూరికి పంపిన పోలీసులు
పది రోజులుగా షాబాద్ కు చెందిన మహిళ విజయ వనపర్తిలో తిరుగుతుంది. ఆమెకు మాటలు రావని వనపర్తి రూరల్ ఎస్ఐ జలేంధర్ రెడ్డి తెలిపారు. మర్రికుంటలోని బాలరాజు నాయక్ హోటల్ వద్ద ఈమె ఉండేదని బాలరాజునాయకే ఈమెకు అన్నం పెట్టేవారని అన్నారు. కంచె రాఘవేంద్ర, అతని స్నేహితుడు కలిసి సమాచారం ఇవ్వడంతో షాబాద్ ఎస్ఐతో మాట్లాడి వివరాలు సేకరించి శుక్రవారం విజయను బంధువులకు అప్పగించారు. బాలరాజు నాయక్, రాఘవేంద్రను ఎస్ఐ సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్