లైంగిక సంబంధం కోసం బలవంతం చేస్తుండటంతో ఓ బాలిన తన బాయ్ఫ్రెండ్ను చంపేసింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో జరిగింది. పుట్సురా గ్రామానికి చెందిన వీరేంద్ర యాదవ్(18)ను తన సోదరి పునితా స్నేహితులైన ఇద్దరు బాలికలు హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వారిద్దరిలో ఒక బాలిక, వీరేంద్ర మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, అయితే లైంగిక సంబంధం కోసం వీరేంద్ర బలవంతం చేస్తుండటంతో స్నేహితురాలితో కలిసి గొంతుకు తాడు బిగించి చంపినట్లు చెప్పారు.