వనపర్తిలో మార్నింగ్ వాక్ లో తూడి మేఘా రెడ్డి

1094చూసినవారు
లోక సభ ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ని గెలిపించాలని కోరుతూ సోమవారం నాలుగవ రోజు మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణవాసులు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్