మహారాష్ట్ర ఎన్నికలు.. ఎంవీఏ లో కుదిరిన సీట్ల ఒప్పందం

81చూసినవారు
మహారాష్ట్ర ఎన్నికలు.. ఎంవీఏ లో కుదిరిన సీట్ల ఒప్పందం
మహావికాస్ అఘాడిలో పార్టీల మధ్య సీట్ల ఒప్పందం బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే)ల మధ్య ఒప్పందం కుదిరింది. మహారాష్ట్రలో మొత్తంగా 288 సీట్లు ఉన్నాయి. ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేయాలని కూటమి నిర్ణయించింది. 270 స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఎంవీఏ నేతలు తెలిపారు. మిగిలిన 18 సీట్లపై ఎస్పీ పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేతలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్