ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గం. ఆలయ ఈవో. ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు భారీగా తరలివస్తుండగా.. అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు.