తమిళనాడులోని కడలూరు జిల్లా గోండూరు ప్రాంతంలో గురువారం విషాదకర ఘటన జరిగింది. మధురైకి చెందిన కణ్ణన్ అనే వ్యక్తి స్థానికంగా నివసిస్తున్నాడు. హోటల్లో ఆహారం కొనుక్కుని రోడ్డు దాటేందుకు యత్నించాడు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ కణ్ణన్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సంఘటనా స్థలంలోనే కణ్ణన్ ప్రాణాలు కోల్పోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.