సమయానికి CPR చేయకపోవడంతో వ్యక్తి మృతి

75చూసినవారు
తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సమయానికి సీపీఆర్ చేయకపోవడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. కీసరలోని ఓ మెడికల్ షాపులో పని చేస్తున్న మురళి కస్టమర్లకు మందులు ఇస్తూ.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. సహోద్యోగి ఫిట్స్ అనుకుని చేతిలో ఇనుప వస్తువులను పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అది గుండెపోటని గుర్తించలేకపోయాడు. సీపీఆర్ చేసి ఉంటే మురళి ప్రాణాలు నిలిచేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్