ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్లో కదులుతున్న లోకల్ ట్రైన్ నుంచి బుధవారం ఓ ప్రయాణికుడు పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ ప్రయాణికుడు రన్నింగ్ ట్రైన్ నుంచి బ్యాలెన్స్ కోల్పోయి ప్లాట్ఫారమ్పై పడ్డాడు. అదే సమయంలో RPF పోలీసులు వెంటనే స్పందించారు. రైలుకు, ప్లాట్ఫారమ్కు మధ్య పడిపోతున్న అతడిని సకాలంలో పక్కకు లాగి కాపాడారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.