అంతర్జాతీయ మాదక రవ్య వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలు విద్యార్థుల తప్పకుండా తెలుసుకోవాలని మాదారం ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. మాదకద్రవ్యాలను వాడడం ద్వారా కలిగే అనర్ధాలు ను పెద్దపెట్టున విద్యార్థులు నినాదాలు చేశారు. అంతకుముందు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.