శాంతిఖని గని కార్మికుల సైకిల్ ర్యాలీ

553చూసినవారు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని కార్మికులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గని నుంచి ప్రారంభమై ఫ్యాన్ హౌస్ వరకు కొనసాగింది. ప్రాజెక్టు అధికారి విజయ ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజనాల రమేష్, లింగాల కిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్