సమస్యల పరిష్కారానికై విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ధర్నాకు వెళుతున్న మధ్యాహ్న భోజనం కార్మికులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం చెన్నూర్ లోని ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.