కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పలువురు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపుకు కృషి చేయాలని కోరారు.