బీఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక
భీమారం మండలం ఎలకేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్బీ పేట్ గ్రామ నాయకులు, మాజీ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ చిప్ప పురుషోత్తం మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.