పెళ్లి ఇంట్లో దొంగతనం కేసులో ఒకరి రిమాండ్

52చూసినవారు
పెళ్లి ఇంట్లో దొంగతనం చేసిన మంచిర్యాల పట్టణానికి చెందిన జాడి సురేష్ ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. దొంగతనం జరిగిందని సోమవారం వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక టీములుగా ఏర్పడి ఇన్వెస్టిగేషన్ చేసి దొంగను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్