పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి గ్రామానికి చెందిన చొప్పరి సత్తయ్య అనే వ్యక్తి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న సత్తయ్య గురువారం ఉదయం పంటకు మందు కొడుతానని చెప్పి పురుగుల మందు తీసుకుని పొలం సమీపంలో చెరువు కట్టపై మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.