నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలి

62చూసినవారు
నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలి
లక్షెట్టిపేట పట్టణంలో నకిలీ విలేకరులుగా చలామణి అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం డీజేఎఫ్ అధ్వర్యంలో ఏఎస్ఐ తానాజీ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎవరైనా విలేకరులమంటూ బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వ్యాపారస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్