మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి

58చూసినవారు
మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి
మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేసే వరకు దశల వారీగా ఉద్యమాలు చేపడతామని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ తెలిపారు. సోమవారం మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మేడే పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను పర్మినెంట్ చేసే వరకు రూ. 30 వేలు వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్