భారత రాజ్యాంగం మారుస్తానన్న బీజేపీ పార్టీని ఓడించాలి

61చూసినవారు
భారత రాజ్యాంగం మారుస్తానన్న బీజేపీ పార్టీని ఓడించాలి
భారత రాజ్యాంగం మారుస్తానన్న బీజేపీ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాలమహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడుతున్న రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ పార్టీ బహుజన ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్