యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన నరేందర్కు.. వలిగొండకు చెందిన ఓ యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. వివాహ వేడుకలో మంగళస్నానం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ, వరుడి మిత్రులు కల్లు, బీరు, విస్కీ బాటిల్స్తో వినూత్నంగా వరుడిపై పోసి హల్దీ ఫంక్షన్ జరిపారు. ఈ తతంగం చేస్తున్న వరుడి మిత్రులను చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయింది.