జైలు వ్యాన్ లో మహిళా ఖైదీ పై అత్యాచారం

1538చూసినవారు
జైలు వ్యాన్ లో మహిళా ఖైదీ పై అత్యాచారం
హరియాణాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. జైలు వ్యాన్‌లో మహిళా ఖైదీపై ఇద్దరు ఖైదీలు అత్యాచారానికి పాల్పడ్డారు. రోహ్‌తక్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీతో పాటు మరో ఇద్దరు మగ ఖైదీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అధికారులు జైలు వ్యాన్‌లో ఎక్కించారు. పోలీసులు డాక్యుమెంట్ వర్క్ చేస్తుండగా ఇద్దరు ఖైదీలు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పడంతో వారు షాక్‌కు గురయ్యారు.

సంబంధిత పోస్ట్