ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా చుట్వాహిలో పోలీసు క్యాంపుపై సోమవారం బాంబులతో దాడి చేశారు. అయితే మావోయిస్టుల దాడి నుంచి పోలీసులు తృటిలో తప్పించుకున్నారు. వారంతా సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇటీవల బీజాపూర్ జిల్లాలోనే జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు చనిపోయారు. దీనికి నిరసనగా 5 రాష్ట్రాల్లో నేడు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు.