అగ్ర హీరో కమల్హాసన్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ మూవీ కోసం జూన్ వరకు ప్రేక్షకులు ఆగాల్సిందే. ప్రస్తుతం తుది దశ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీసింహా కీలక పాత్రలు పోషించారు. సేనాపతి పునరుత్థానం అంటూ చిత్రబృందం ఆదివారం ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది.