ముంబయి ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూరత్కు చెందిన నలుగురు యువకులు ఇటీవల బ్యాంకాక్ వెళ్లారు. వారు మంగళవారం ముంబయికు తిరిగి రాగా వారి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్కు చెందిన ఓ డ్రగ్ పెడ్లర్ నలుగురిని థాయ్ లాండ్ చూపిస్తానని పిలిపించి తిరిగి వెళ్లే క్రమంలో వారి బ్యాగులలో డ్రగ్స్ పెట్టినట్లు సమాచారం. పట్టుబడిన గంజాయి విలువ రూ.15.85 కోట్లు ఉంటుందని తెలిపారు.