మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయ జాతరను ఆదివారం ముదిరాజుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జాతరలో పాల్గొన్న ఎస్సై ఐమద్ మొదిన్ ను భీమ్రావుపల్లి మాజీ వార్డు మెంబర్ బోయిని భూషణం శాలువాతో సన్మానించారు.