హనుమకొండ లష్కర్బజార్లోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క-సారలమ్
మ జాతర హుండీ లెక్కింపు ఇవాళ కూడా కొనసాగుతోంది. ఇవాళ ఐదో రోజు సోమవారం హుండీ లెక్కింపు పూర్తయింది. 76 హుండీల లెక్కింపులో రూ.93.67 లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు లెక్కించిన 481 హుండీలలో రూ.11.25 కోట్ల ఆదాయం సమకూరింది.